Press Releases

భద్రాద్రి బ్యాంకులో గౌ|| కొణిజేటి రోశయ్య గారితో ఆత్మీయ సమ్మేళనం (September 17, 2018)

తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ కొణిజేటి రోశయ్య గారితో భద్రాద్రి బ్యాంకు చైర్మన్ శ్రీ చెరుకూరి కృష్ణ మూర్తి గారు మరియూ బ్యాంకు డైరక్టర్లు బ్యాంకు సిబ్బంది మరియూ శ్రేయోభిలాషుల సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం భద్రాద్రి బ్యాంకు ప్రధాన శాఖ నందు ఆనందోత్సవాల మధ్య ది.14/09/2018 తేదీన జరిగింది.

సభనుద్దేశించి శ్రీ కొణిజేటి రోశయ్య గారు మాట్లాడుతూ తమ చేతుల మీదుగా 1997 లో ప్రారంభించ బడిన భద్రాద్రి బ్యాంకు నేటికి 21 వసంతాలు పూర్తి చేసుకొని 16 శాఖలతో, రూ.600 కోట్లకు పైగా వ్యాపార అభివృద్ధితో విజయవంతంగా నిర్వహించబడటం మిక్కిలి సంతోషకరమని కరతాళ ధ్వనుల మధ్య తెలిపారు.

అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ, బ్యాంకు పురోభివృద్ధికి భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారాన్ని అందించగలనని హర్ష ధ్వానాల మధ్య తెలియ చేసారు. తదుపరి బ్యాంకు పాలక వర్గం శ్రీ రోశయ్య గారికి ఆత్మీయ సన్మానము నిర్వహించింది.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ చెరుకూరి కృష్ణముర్తిగారు శ్రీ రోశయ్య గారితో తమకు మరియూ బ్యాంకుకు గల అనుభవాలను పంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్లు శ్రీ దేవత రాజారావు గారు , శ్రీ యాదా కృష్ణ మూర్తి గారు, బ్యాంకు డైరక్టర్లు శ్రీ మద్ది వెంకట లక్ష్మీ నరసింహారావు గారు, శ్రీ గుర్రం ఉమా మహేశ్వర రావు గారు, శ్రీ అర్వపల్లి నిరంజన్ గారు, శ్రీ రేఖల భాస్కర్ గారు, శ్రీ గాడేపల్లి మాధవ రావు గారు, శ్రీమతి కర్లపూడి నర్మద గారు, శ్రీ సన్నె ఉదయ్ ప్రతాప్ గారు. శ్రీ వేములపల్లి వెంకటేశ్వర రావు గారు, శ్రీ వేల్పూరి సాంబ శివరావు గారు, మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

View Gallery